Sunday, November 24, 2013

తిరుపతి లడ్డు

లడ్డు పేరు చేబితే వేంటనే టక్కున గుర్తోచ్చేది మన తిరుపతి లడ్డు.సామాన్యుల నుండి కోట్లకు పడగలేత్తిన భాగ్యవంతుడి వరకూ ఎంతో భక్తిభావంతో ఆరగించి తినేది తిరుపతి లడ్డు.లడ్డూలంటే మన తిరుపతి లడ్డూలే ఆరుచి మన నాలుకను చేరుకొగానే మనసంతా ఒక్కసారి భక్తిభావంతో పులకరించి మయమరుస్తుంది.శ్రీవారి ప్రసాదంలో దద్దోజనం,పోంగలి వంటివెన్నున్నా తిరుపతి లడ్డూకున్న గిరాకితో పోలిస్తే ఇవేవి సరిపోవు.

ఎవరెంత కొపంతో ఉన్నా వారికి తిరుపతి లడ్డూ ఇస్తే ఇట్టే కరిగిపొతారు.ఏపని సాదించడానికి అయిన అంతటి బ్రహ్మస్త్రం మన లడ్డూ.పూర్వకాలం నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు పంచుతున్నా 1940 ప్రాంతంలో కళ్యాణోత్సవాలు మొదలయినపుడు మనం ఇపుడు చూసే లడ్డూ తయారి మొదలైంది. దీన్ని తయారుచేయడానికి ప్రత్యెక పద్దతి అంటూ ఒకటి ఉంది.లడ్డూ తయారు చేయడానికి వాడె సరుకుల మొత్తాన్ని దిట్టం అని పిలుస్తారు.ఈదిట్టం స్కేలును 1950లో మొదట రూపొందించగా భక్తులతాకిడిని బట్టి దీనిని 2001లో సవరించారు.ఇపుడు ఈ స్కేలు ప్రకారమే లడ్డూలను తయారు చేస్తున్నారు.

శ్రీవారి లడ్డూ తయారిలో వాడే దిట్టంలో వాడేఅ సరుకులు -
ఆవు నెయ్యి - 165 కిలోలు
శెనగపిండి - 180 కిలోలు
చక్కెర - 400 కిలోలు
యాలుకలు - 4 కిలోలు
ఎండు ద్రాక్ష - 16 కిలోలు
కలకండ - 8 కిలోలు 
ముంతమామిడి పప్పు -30 కిలోలుఈ మిశ్రమంలో సుమారు 5,100 లడ్డూలు వరకూ తయారవుతాయి.శ్రీవారి ఆలయం ఆగ్నేయదిక్కులో ఉన్న వంటశాలలో సుమారు 15000 వరకూ లడ్డూలు తయారవుతాయి.తొలి రోఅజుల్లో లడ్డూలను కట్టెలపొయ్యి మీద తయారుచేసేవారు.అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యంత్రాలను ప్రవేశపెట్టారు.వీటివల్ల కొంచెం రుచి,నాణ్యత తగ్గినా గిరాకి మాత్రం తగ్గలేదు.ఈ మద్యే మన లడ్డూకు పేటెంట్ హక్కు కూడా లభించింది.
ఆలయంలో లభించే లడ్డూలు మూడు రకాలు
1.ఆస్ధానం లడ్డూ - వీటిని ప్రత్యేక వుత్సవాలు సందర్భంగా మాత్రమే తయారుచేస్తారు.ప్రత్యేక అతిధులకు మత్రమే వీటిని అందజేస్తారు.
2.కళ్యాణోత్సవ లడ్డూ - దీనిని కళ్యాణోత్సవాల సమయంలో ఉత్సవాల్లో పాల్గోనే భక్తులకు అందజేస్తారు.
3.ప్రోక్తం లడ్డూ - వీటిని సాధారణ దర్శనానికి వచ్చే భక్తులకు అందజేస్తారు.

బాధలెందుకు?

ప్రశ్న: సద్గురు, సృష్టి స్వయం సంపూర్నమైతే, సృష్టికర్త మనకు ఎంతో మంచి చేసిన వాడైతే, ఈ ప్రపంచం లో ఇన్ని బాధలెందుకు ఉన్నాయి? మనం ఇతరుల దయ మీద, సానుభూతి మీద ఎందుకీ ప్రపంచంలో ఆధారపడి బతకాల్సి వస్తోంది?


సద్గురు:(నవ్వుతూ) అంటే సృష్టి సంపూర్ణం అయినదే అయితే ఇన్ని చింతలు ఈ లోకం లో ఎందుకు ఉన్నాయి? అదెంత స్వసంపూర్ణమంటే నువ్వెలాగ ఉండాలనుకుంటే అలాగుండే అవకాశాన్ని నీకిస్తుంది.సృష్టి ఒకవేళ నువ్వు ఉండాలనుకున్తున్నట్టుండే అవకాశం నీకిచ్చి ఉండకపోతే ప్రపంచంలో ఇన్ని అవకాశాలు ఉండేవా? అప్పుడు 'విమోచనం' అనే పదం ఉండేదికాదు. ఎందుకు అనవసంగా బంధాలు పెంచుకోవడం మల్లి వియోచన కోసం పాకులాడటం. కేవలం వియోచనే ఎందుకు ఉండకూడదు? మరి అప్పుడిక సృష్టే ఉండదు. సృష్టి ఉందికనుకే, దానికన్నా ముందుకు సాగే అవకాశం కూడా ఉంది.

జంతువు,ఇతర రూపాల్లో మన చుట్టూ కన్పించే జీవం మొత్తంలో ఈ అవకాశం లేదు కదా! ఈ అవకాశం జీవితంలో మనుగడ సాగించడానికి, పునరుత్పుత్తి చేయడానికి,జీవితాన్ని కొనసాగించి ఏదో ఒకరోజు పోవడానికి. ఎక్కువ అవకాశం లేకపోవడం వల్ల, ఎక్కువ చింత కూడా లేదు. మనిషి లాగా ఈ భూమ్మీద బతికే ఏ ఇతర ప్రాణీ బాధపడటం చూడం. వాటి బాధంతా శారీరకం మాత్రమే. శరీరానికి దెబ్బ తగిలితే వాటికి నొప్పి కలుగుతుంది. నొప్పిలో కూడా, మనిషి అనుభవించే నొప్పి వాటికి తెలీదు.

మనిషిగా నీకు ఎటువంటి బాధ తెలుసుంటే ఇది సృష్టి నీకు ఇచ్చింది కాదు.