Friday, June 28, 2013

యోగ

సంస్కృతీ, సంప్రదాయాలకు నిలయమైన భారత దేశానికి అత్యంత ప్రాచీనమైన సంపద యోగ.భారత సంతతికి వంశపారంపర్యంగా, గురూపదేశంగా నేటికీ విడువకుండా అనుసరిస్తూ వస్తున్న ఏకైక హృదయ తరంగమిది. ఇది భారత ఋషుల అద్భుత సృష్టి. ఈ సృష్టికి 5 వేల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. మనసుని అధీనంలో ఉంచుకోవడం ద్వారా ప్రాణ శక్తిని పెంపొందించడమనే ఈ ప్రక్రియ అద్భుతాలలోకెల్లా అద్భుతం. ఎటువంటి ఔషధాలూ, శస్త్ర చికిత్సలూ అవసరం లేకుండా కేవలం చిన్న చిన్న వ్యాయామాల ద్వారా దీర్ఘకాలిక రోగాలనుండి విముక్తులు కావడం వైద్య శాస్త్ర రంగానికి ఓ చాలెంజ్.

క్రమశిక్షణతో కూడిన ఆరోగ్యాన్ని అలవరచుకోవడానికి యోగ అనువైన విధానం. ప్రత్యామ్నాయ వైద్య విధానంగా అమిత ప్రాచుర్యంలో ఉన్న యోగ నియమబద్ధమైన ఆహారం, అలవాట్లు ఉన్నవారికే సాధ్యం. సహజసిద్ధమైన ఆహారం యోగా అభ్యాసకులకు అతి ముఖ్యం. తీపి పదార్ధాలు, రసాయనాలు కలిపిన పదార్ధాలు వీరికి నిషిద్ధం. వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వ్యసనాలకు కూడా దూరంగా ఉండాలి. నేటి ఆధునిక జీవనం ఇందుకు ఏమాత్రం అనువుగా లేకపోవడంతో యోగ సాధన కష్టసాధ్యమైనా, యోగానే జీవన విధనంగా ఎంచుకుంటే ఎవరి ఆరోగ్యం వారి అధీనంలోనే ఉంటుంది.

ఆసనం అంటే?

ఆసనం పుట్టుక గురించి మూలాధారాలు లేవు. మనిషి పుట్టిన నాటినుంచి అది ఉంది. ఉయ్యాలలోని పసిబిడ్డ చేసే విన్యాసాలు కూడా ఆసనం క్రిందే వస్తాయి. మనిషి శారీరకంగా వ్యక్తపరచే ఏ భంగిమనైనా ఆసనం అనవచ్చు. ఐతే ఆ భంగిమలు ఒక క్రమపద్ధతిలో ఉండాలి. వాటికి తగినంత వ్యాయామం ఉండాలి. ఆసనాలు ఎన్ని అనడంలో భేదాభిప్రాయాలున్నా మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి కనీసం 25 ఆసనాలైనా వేయడం ఉత్తమమని యోగ పండితులు చెబుతారు. వాటిలో పద్మ, చక్ర, సర్వాంగ, హల, ధను, మయూర,పశ్చిమోత్తన, శీర్ష, శవాసనాలు తప్పకుండా వేయాల్నిన ఆసనాలు.

భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ, ఉపనిషత్తులలో మహర్షులు అత్యంత యోగ విజ్ఞానాన్ని అందించారు. యోగాలలో కూడా పలు రకాలున్నాయి. అవి రాజ యోగము, హఠ యోగము, కర్మ, భక్తి, ధ్యాన, జ్ఞాన యోగము...ఇంకా అనేకం. రాజ యోగాన్ని శ్రేష్టమైనదిగా చెబుతారు. యోగాసనాలతోపాటు నేతి, ధౌతి, భస్తి, త్రాటకం, కపాలభాతి మొదలైన హఠ యోగ క్రియలు కూడా నేడు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కానీ వీటిని అభ్యసించేవారు చాలా తక్కువ.యోగాసనాలు ఎందుకు వేయాలి?

మానవ శరీరం మాలిన్యాల పేటికలాంటిది. దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి. మాలిన్యాలే అనారోగ్యానికి మూలకారణం. వాటిని నిర్వీర్యం చేయనిదే ఆరోగ్యం సాధ్యం కాదు. మాలిన్యాల నిర్మూలకు యోగా చక్కని పరిష్కారం. యోగ వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల పెద్దగా కష్టపడనవసరంలేని యోగాసనాలు చేయడం ప్రతి ఒక్కరికీ అవసరం.

అర్హత?

వయసుతో నిమిత్తం లేదు. పసిపిల్లాడినుంచి పండు ముదుసలి వరకు అందరూ అర్హులే. దీనికి స్త్రీ, పురుష విచక్షణ అంతకంటే లేదు. శారీరక దృఢత్వంతో అవసరం లేదు. పరికరాల ఊసే లేదు. ఒక్క రూపాయి ఖర్చు కూడా కాదు. అందరూ అర్హులే. అంతటా అర్హతే.

యోగ చికిత్స అంటే ఆసనాలు, ప్రాణాయామ పద్ధతులు, ముద్రలు, బంధాలు, క్రియల సహాయంతో ఆరోగ్యవంతులను చేసే విధానం. పతంజలి మహర్షి 195 సూత్రాలను "యోగ సూత్రాలు" అనే గ్రంధంలో క్రోడీకరించాడు. ఒక్కో యోగాసనం ఒక్కో అనారోగ్యాన్ని నయం చేస్తుంది. దీర్ఘకాలిక రోగాలకు దీనిని మించిన చికిత్స లేదు. కాబట్టే ఇప్పుడు ప్రజలు ఎక్కువగా యోగ థెరపివైపు మొగ్గుచూపుతున్నారు. యోగ అంటే ప్రకృతికి సన్నిహితంగా సహజీవనం చేయడమే. ప్రకృతి వైద్య విధానంలో ఇది ఒక భాగం. సహజసిద్ధమైన ఆరోగ్యానికిది ఇది చక్కని మార్గం. స్థూలకాయం, మధుమేహం, రక్త పోటు, ఉదరకోశ వ్యాధులు, మలబద్ధకం, కీళ్ళు మరియు నడుము నొప్పులు రాకుండా ఉండాలంటే యోగా ఒక్కటే మార్గమని అనుభవపూర్వకంగా తెలుస్తోంది. యోగా ద్వారా ఆరోగ్యమే కాదు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది కాబట్టి కాబట్టి వెంటనే ప్రారంభించడం ఉత్తమం.




యోగ సాధనతో వ్యాధులు దూరం

పతంజలి మహర్షి యోగని ఎనిమిది భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి అయిదు ధ్యానసాధనలో బాహ్యంగా సహాయపడితే, చివరి మూడు అంతర్గత శక్తులను వెలికి తీసేందుకు దోహదం చేసి, యోగ సాధన ఫలాలను యిస్తాయి.

ఎనిమిది విధానాలు:
యమ: ఒక సైనికుడి ఆయుధాలను అప్పగించినప్పుడు ముందుగా క్రమశిక్షణ నేర్పుతారు. ఎప్పుడు వాటిని ప్రయోగించాలి అనే విషయంతో పాటు సమాజ పరిరక్షణకు, శాంతి స్థాపనకు ఎలా ఉపయోగపడాలనేది అవగతం చేసుకుంటారు. జీవిత విధానంపై, ప్రవర్తనపై నిర్దిష్టమైన క్రమశిక్షణ వుండాలి.
ఆ అయిదు అంశాలు:
1.
అహింస
2.
సత్యం
3.
బ్రహ్మచర్యం
4.
దొంగతనానికి పాల్పడకపోవడం
5.
కోరికలను అదుపులో ఉంచుకోవడం
ఈ అయిదు అంశాలను పాటించినప్పుడే యోగ సాధకుడు ముందు అడుగు వేయగలడు.
నియమాలు: యోగ సాధన ఈ దేహంతోనే చేయవలసి వుంటుంది. అందువల్ల శరీరం రోగగ్రస్తం కాకూడదు. ఆరోగ్యంగా, ధృఢంగా వుండాలి. ప్రకృతిలోని ఎటువంటి మార్పులని అయినా తట్టుకునే శక్తి కలిగి వుండాలి. వాంఛలు అదుపులో వుండాలి. సాధకుడు తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలగాలి. ఆ అనంతశక్తిని తెలుసుకోవాలనే జ్ఞానతృష్ణ కలిగి వుండాలి. పతంజలి మహర్షి సూచించిన అయిదు నియమాలు ఇవి:-

1.
పరిశుభ్రత
2.
సంతృప్తి
3.
సంయమం
4.
ధర్మశాస్త్రాల అధ్యయనం
5.
ప్రతి చర్యను భగవత్‌ అర్పితం చేయడం
ఈ అయిదు నియమాలను పాటించడంతో సాధకుడికి మానసికంగా, శారీరకంగా ప్రయోజనం చేకూరుతుంది.
ఆసనాలు: ప్రస్తుత కాలంలో యోగ పేరు చెప్పగానే అందరూ యోగాసనాల గురించే మాట్లాడుతున్నారు. హఠయోగంలో ఆసనాలు ఒక భాగం.
పతంజలి మహర్షి ఏనాడూ యోగాసనాలు పాటించాలని ఖచ్చితంగా చెప్పలేదు. కేవలం విశ్రాంతిగా, స్థిరంగా కూర్చునే ఆసనాన్ని మాత్రమే సూచించారు పతంజలి. పద్మాసనం కూడా అనుమతించారు. ఆసనాలతో శరీరంలోని భౌతికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వేడి, చలిలాంటి ఉష్ణోగ్రత స్థితులపై అదుపు లభిస్తుంది. హఠయోగంలో పేర్కొన్న ఆసనాలను పాటించడంలో ఎటువంటి వ్యతిరేకత లేదు కాని, అత్యున్నతమైన సమాధిస్థితిని చేరుకోవడానికి యిది ప్రామాణికం కాదు.
ప్రాణాయామం: హఠ యోగంలో పేర్కొన్న వ్యాయామాల గురించి, పతంజలి మహర్షి ఎలా నొక్కి చెప్పలేదో, అలాగే శ్వాసక్రియ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పలేదు. కేవలం ఏకాగ్రతతో, నెమ్మదిగా, గాఢంగా ఊపిరి పీల్చి వదలడం మాత్రమే ఆయన సూచించారు. ఇలా ఉచ్ఛాశ్వ, నిశ్వాసక్రియ చేయడం వల్ల ఇంద్రియాలపై అదుపు ఏర్పడుతుంది. ఏకాగ్రతని వ్ధృది చేస్తుంది. అనునిత్యం సాధనం చేయడం వల్ల మాత్రమే యిది సాధ్యపడుతుంది.
ప్రత్యాహర: ఇంద్రియ నిగ్రహమే ప్రత్యాహర. ఇంద్రియ నిగ్రహం అంటే కేవలం వాంఛల నియంత్రణ, వైరాగ్యం పెంపొందించుకోవడం, ధర్మశ్త్రాసాల్లో చెప్పినట్లు నడుచుకోవడమే కాదు. నిరంతర ఏకాగ్రత సాధనతో జాగ్రదావస్థని దాటివుండటం. మెదడుని అదుపులో ఉంచడానికి నిరంతరం హృదయం, ఇంద్రియాలు ప్ర్నయతిస్తుంటాయి. వాటిని జయించడానికి పైనచెప్పినట్లు నిరంతర సాధన, ఏకాగ్రత అవసరం.
ధారణ: సాధనలో పై అయిదు దశలు దాటాక, శరీరం, శ్వాసక్రియ, మనసు సాధకుడి అదుపులోకి వస్తాయి. ఇప్పుడు ఏకాగ్రతపై దృష్టి నిలపాలి. సాధకుడు ఓ ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని, ఓ నిరిద్దష్టమైన వస్తువుపై దృష్టి కేంద్రీకరించాలి. ప్రతి రోజూ యిలా సాధన చేయడం వల్ల సాధకుడు ఏకాగ్రతలో ఓ ఉన్న్థతసితిని చేరుకుంటాడు.
ధ్యానం: ఆలోచనల ప్రవాహానికి ఆనకట్ట వేయడానికి ధ్యానాన్ని మించినది లేదు. ధ్యానంలో ఒక వస్తువుపై దృష్టి నిలిపినప్పుడు, క్రమేపీ ఆలోచనలు అంతరిస్తాయి. తనకి, ఎదురుగా వున వస్తువుకి తేడా స్పష్టంగా తెలుస్తుంది. ఈ దశలో ఇంద్రియాలు, మనసు కూడా ఆ ్తవసువు వైపే లగ్నమవుతాయి. ఏకాగ్రత అనేది సహజసిద్ధంగా ఏర్పడుతుంది. ఇదొక అత్యున్నత స్థితి. ఈ స్థితికి చేరుకున్నాక సమస్యలను అర్ధం చేసుకోవడమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా గోచరిస్తాయి.
సమాధి: ధ్యానానికి, యోగకి యిదే పతాకస్థాయి. సాధకుడు తను అనే అహాన్ని మరిచి, ఏ శక్తిని/వస్తువుని తన దృష్టి లగ్నంగా చేసుకున్నాడో ఆ శక్తి, తాను ఒకటే అనే స్థితికి చేరుకుంటాడు. హద్దులన్నింటిని దాటుకుని, ఈ ఉన్నతస్థితికి చేరుకున్న వ్యక్తిని ‘యోగి’ అంటారు. సమాధి స్థితికి చేరుకున్న సాధకుడు ప్రకృతిని అర్ధం చేసుకోవడమే కాదు, స్పర్శించగలడు, ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ అనుభూతి చెందగలడు. ఈ అపూర్వ శక్తితోనే వేద ఋషులు కంప్యూటర్ల వంటి సాంకేతిక సహకారం లేని కాలంలోనే నాలుగు లక్షల సంవత్సరాలకు ఒకసారి గ్రహాలన్నీ ఒకే రేఖలోకి వస్తాయని, అదే యుగాంతమని కనుగొన్నారు

No comments:

Post a Comment